స్వ‌చ్ఛ‌తా హీ సేవాకు ర‌జ‌నీకాంత్ మ‌ద్ద‌తు

Rajinikanth Supports Narendra Modi Swachhata Hi Seva Mission

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేప‌ట్టిన స్వ‌చ్చ‌తా హీ సేవా కార్య‌క్ర‌మానికి సెల‌బ్రిటీల నుంచి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే స‌చిన్ టెండూల్క‌ర్, అనుష్క శ‌ర్మ‌, అక్ష‌య్ కుమార్ వంటి ప్ర‌ముఖులు స్వ‌చ్చ‌తా హీ సేవా లో పాల్గొంటామ‌ని ప్ర‌క‌టించ‌గా…తాజాగా తమిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా మోడీకి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించారు. స్వ‌చ్చ‌తా హీ సేవా కార్య‌క్ర‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాన‌ని, ప‌రిశుభ్ర‌తే దైవ‌భ‌క్తి అని ఆయ‌న ట్వీట్ చేశారు. సెప్టెంబ‌రు 15 న మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం గాంధీ జ‌యంతైన అక్టోబ‌రు 2 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు ప్రారంభించిన స్వ‌చ్ఛతా హీ సేవాలో పాల్గొనాల్సిందిగా…ఉత్త‌ర, ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన అనేక‌మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులుకు, పారిశ్రామిక వేత్త‌ల‌కు మోదీ స్వ‌యంగా లేఖ‌లు రాశారు. సెల‌బ్రిటీలు ఇందులో భాగ‌స్వామ్యుల‌యితే వాళ్ల స్ఫూర్తితో ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు స్వ‌చ్చ‌తా హీ సేవాలో పాల్గొంటార‌ని, దేశం కోసం ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌ని మోడీ కోరారు. ఆయ‌న పిలుపుకు సెల‌బ్రిటీలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.