అవును…అమ్మ‌ను శ‌శికళ కుటుంబ‌మే చంపింది

aiadmk-senior-leader-dindigul-srinivasan-made-sensational-comments-on-sasikala-family

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

త‌మిళ‌నాడుతో పాటు దేశ‌ప్ర‌జ‌లంతా అనుమానించిందే నిజ‌మ‌ని తేలుతోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, శశిక‌ళే ఆమెను ఏదో చేసింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మేన‌ని సాక్షాత్తూ త‌మిళ‌నాడు మంత్రి, అన్నాడీఎంకే సీనియ‌ర్ నేత దిండిగ‌ల్ శ్రీనివాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌యల‌లిత మ‌ర‌ణానికి శ‌శిక‌ళ కుటుంబ‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 22న జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో చేరిన త‌రువాత త‌న‌తో స‌హా అన్నాడీఎంకే నేత‌లెవ్వ‌రూ ఆమెను చూడ‌లేద‌ని శ్రీనివాస‌న్ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రిని చూడ‌టానికి ఆస్ప‌త్రికి వ‌చ్చిన వారిని శ‌శిక‌ళ బంధువులు ఒక రూంలోనే కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవారని తెలిపారు. శ‌శిక‌ళ వ‌ర్గానికి భ‌య‌ప‌డి తాము ప్రజ‌ల‌కు అమ్మ ఆరోగ్యం గురించి అబ‌ద్ధాలు చెప్పామ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఆస్ప‌త్రిలో అమ్మ పేపరు చ‌దువుతున్నార‌ని, సాంబార్ ఇడ్లీ తిన్నార‌ని తాము చెప్పిన‌వ‌న్నీ అబద్ధాలే అన్నారు. జ‌య ఆరోగ్యం గురించి స‌రైన స‌మాచారం తెలియ‌ని త‌మిళ ప్ర‌జ‌లు త‌మ అబ‌ద్దాల‌ను న‌మ్మి ఆమె కోలుకుంటోంద‌ని భావించార‌ని, అమ్మ గురించి నిజాలు చెప్ప‌ని త‌న‌ను వారంతా క్ష‌మించాల‌ని ఆయ‌న కోరారు.