రేణుదేశాయ్‌తో పాటు అదాశర్మ, జానీమాస్టర్‌

bollywood stars Entry Into A Telugu TV Dance Show as A Judge

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

స్టార్‌ మాటీవీలో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న ‘బిగ్‌బాస్‌’ షో మరి కొన్ని రోజుల్లో ముగియనున్న విషయం తెల్సిందే. బిగ్‌బాస్‌ షో వచ్చే సమయాన్ని భర్తీ చేసేందుకు కొన్ని కొత్త సీరియల్స్‌ మరియు కొన్ని షోలను కూడా స్టార్‌ మాటీవీ ప్లాన్‌ చేసింది. అందులోని భాగంగా వచ్చేదే మెగా డ్యాన్స్‌ షో నీతోనే. ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించబోతున్న ఈ డాన్స్‌ షో ఇప్పటి వరకు తెలుగు బుల్లి తెరపై రానంత భారీగా రాబోతుంది. హిందీ ఛానెల్‌ స్టార్‌ ప్లస్‌లో ప్రసారం అయ్యే నాచ్‌ బలియే తరహాలో ఈ డాన్స్‌ షోను సిద్దం చేస్తున్నారు.

ఈ షోకు ప్రముఖులను జడ్జ్‌లుగా మాటీవీ తీసుకు వస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ను ఈ షోకు ప్రధమ గెస్ట్‌గా ఎంపిక చేయడం జరిగింది. రేణుదేశాయ్‌ ఎంట్రీతో ఈ డాన్స్‌ షో స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత జానీ మాస్టర్‌ను సెకండ్‌ జడ్జ్‌గా ఎంపిక చేయడం జరిగింది. ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలకు డాన్స్‌ను కంపోజ్‌ చేసిన ఈయన ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక మూడవ జడ్జ్‌గా హార్ట్‌ఎటాక్‌ బ్యూటీ అదాశర్మను ఎంపిక చేయడం జరిగింది. ఈ ముగ్గురు జడ్జ్‌లుగా, ఉయదభాయను యాంకర్‌గా దాదాపు 30 మంది డాన్సర్స్‌తో ఈ షోను భారీగా ప్లాన్‌ చేస్తున్నారు.