‘అజ్ఞాతవాసి’ గురించి ఆసక్తికర వార్త

Interesting news about Agnathavasi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఇప్పటిక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో 25వ చిత్రం అవ్వడంతో అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు త్రివిక్రమ్‌ తన కెరీర్‌లోనే దిబెస్ట్‌ అనేట్లుగా ఉండాలనే ఉద్దేశ్యంతో, తన సన్నిహితుడు పవన్‌కు ఇండస్ట్రీ హిట్‌ దక్కాలనే తపనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. పవన్‌ ఈ చిత్రంలో చాలా విభిన్నంగా కనిపిస్తాడని, హీరోయిన్స్‌ కీర్తి సురేష్‌, అను ఎమాన్యూల్‌తో చేసే రొమాన్స్‌ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 

సంక్రాంతికి సినిమా విడుదల దాదాపు ఖరారు అయ్యింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక పాటను విడుదల చేయడం జరిగింది. ఇలా ఒక్కో పాట కాకుండా మిగిలిన అన్ని పాటలను ఒకే సారి విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ కోసం విదేశాల్లో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఈనెల చివర్లో సినిమా షూటింగ్‌ పూర్తి అవుతుంది. ఆ వెంటనే పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణానంతర కార్యక్రమాల్లో పాల్గొంటాడు. డిసెంబర్‌ 15 వరకు ఫస్ట్‌ కాపీ సిద్దం చేయాలనే పట్టుదలతో దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక సినిమా ఆడియోను డిసెంబర్‌ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం అప్పుడే ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. శిల్పకళా వేదికను హాసిన  హారిక సంస్థ డిసెంబర్‌ 14కు బుక్‌ చేసినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పవన్‌, త్రివిక్రమ్‌ కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇది ఉంటుందని మెగా ఫ్యాన్స్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు.