జైల్లో పెడితే హ‌ర‌ప్పా నాగ‌రిక‌త‌పై పుస్త‌కం రాస్తా…

kancha Ilaiah says write Harappan civilization book

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కంచె ఐల‌య్య తాజాగా ఇంకొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆర్యులు ఇక్క‌డివారు కాద‌ని, ద్ర‌విడులే భార‌త‌దేశానికి చెందిన వార‌ని, ఆర్యులు దేశంపై దండెత్తి, ద్ర‌విడ సంస్కృతిని నాశ‌నం చేశార‌ని కంచె ఐల‌య్య ఆరోపించారు. ఆర్య‌వైశ్యుల‌ను ఉద్దేశిస్తూ… వారు విదేశాల నుంచి వ‌చ్చిన వార‌ని, వారి కులంపేరులోనే ఆర్యం అని ఉంద‌ని ఆయ‌న అన్నారు. తాము హ‌ర‌ప్పా నాగ‌రిక‌త నాటి ద్రావిడుల‌మ‌ని ఐల‌య్య చెప్పుకొచ్చారు. త‌న పుస్తకానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న ఆర్య‌వైశ్యుల తీరుతో తాను వాకింగ్ మానేశాన‌ని, ద్ర‌విడ డ్యాన్స్ చేస్తున్నాన‌ని కంచె ఐల‌య్య వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటాన‌న్న నాయిని న‌ర్సింహారెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఐల‌య్య ముందు ఆయన వేదాల్లో ఏమున్న‌దో తెలుసుకోవాల‌ని సూచించారు. త‌న‌ను జైల్లో వేస్తే ఆర్యులు నాశ‌నం చేసిన హ‌రప్పా నాగ‌రిక‌త‌పై పుస్త‌కం రాస్తానని తెలిపారు. గొప్ప గొప్ప వాళ్లు జైళ్ల‌ల్లో ఉన్న కాలంలో పుస్త‌కాలు రాశార‌ని, గొల్ల‌వాడు అయిన శ్రీకృష్ణుడు జైల్లోనే పుట్టాడ‌ని వ్యాఖ్యానించారు ఐల‌య్య‌. రాజ్యాంగానికి సవ‌ర‌ణ‌లు చేప‌ట్టిన‌ట్టే శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ చెప్పిన భ‌గ‌వ‌ద్గీత‌ను బ్రాహ్మ‌ణులు త‌మ‌కు న‌చ్చిన‌ట్టు రాసుకున్నార‌ని ఐల‌య్య ఆరోపించారు. తాను రాసిన పుస్త‌కం మీద చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌రిగితే ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌బోద‌న్నారు.