ఆమె పరువు తీసిన లక్ష్మీస్ వీరగ్రంధం డైరెక్టర్ .

Lakshmis veeragrandham Director Insulted Lakshmi Parvathi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వ్యూహాలు మాత్రమే ఉంటాయి ప్రతి వ్యూహాలు ఉండవన్న పిచ్చిభ్రమలో “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా అనౌన్స్ చేస్తే సంబరపడిపోయిన లక్ష్మీపార్వతి కి “ లక్ష్మీస్ వీరగ్రంధం “ పెద్ద షాక్ . ఆ సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి లక్ష్మీపార్వతి కి ఏమి చేయాలో అర్ధం కావడం లేదు . ఆ సినిమా ఆపేయాలని కొద్దిమందిని తీసుకుని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్షకి దిగితే ఆమె గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు . ఆమే కూర్చుని ఆమే అక్కడ నుంచి లేచి రావాల్సి వచ్చింది . లక్ష్మీస్ వీరగ్రంధం వెనుక టీడీపీ హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్న ఆమె ఉక్రోషం పట్టలేక ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీని, చంద్రబాబు పాలనని తూర్పారబట్టారు. ఇక “లక్ష్మీస్ వీరగ్రంధం “ గురించి ఆమెని ప్రశ్నిస్తే ఏమీ తెలియదని చెప్పిన లక్ష్మీపార్వతి ఇంకో అడుగు ముందుకు వేశారు. ఆ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పారు.

లక్ష్మీపార్వతి చెప్పిన ఈ డైలాగ్ ని కేతిరెడ్డి ఆమె పరువు తీయడానికి వాడుకున్నాడు. తమిళనాడులో తెలుగు భాష ని రెండో సబ్జెక్టు గా తీసుకోవడం మీద ఆ రాష్ట్ర సర్కార్ నిషేధం విధించినప్పుడు అక్కడి తెలుగు వాళ్ళు నిరసన తెలిపారు. దానికి ఉద్యమ రూపం ఇచ్చేందుకు కేతిరెడ్డి ఆధ్వర్యంలోని తమిళనాడు తెలుగు యువశక్తి తరపున చెన్నైలో ఓ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కేతిరెడ్డి, లక్ష్మీపార్వతి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు వేదిక మీద వున్న ఫోటోని ఆయన విడుదల చేశారు. నేనెవరో తెలియదని ఈ ఫోటో చూసాక కూడా లక్ష్మీపార్వతి చెప్పగలరా అని కేతిరెడ్డి నిలదీస్తుంటే లక్ష్మీపార్వతి పరువు పోయినట్టు అయ్యింది. ఇప్పుడే కేతిరెడ్డి ఇలా రెచ్చిపోతుంటే లక్ష్మీస్ వీరగ్రంధంలో ఇంకెన్ని రహస్యాలు బయటపెడతాడో అని లక్ష్మీపార్వతి హడలిపోతున్నారట.