మహేష్‌బాబు కెరీర్‌లో మొదటి సారి..!

Mahesh Babu and Vamsi Paidipalli Movie Starts on 14th August

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రస్తుతం స్టార్‌ హీరోలు అంతా కూడా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కొందరు హీరోలు సంవత్సరంలో ఒక్కటి కూడా విడుదల చేయడంలో విఫలం అవుతున్నారు. ఒక స్టార్‌ హీరో ఒక సినిమాను చేస్తున్న సమయంలో మరో సినిమాను గురించి ఆలోచించడం చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. ఒక వేళ ఒక సినిమా చేస్తున్న సమయంలో మరో సినిమా గురించి ఆలోచించినా, షూటింగ్‌ను మాత్రం ప్రారంభించడం జరగదు. మహేష్‌బాబు కొన్ని సంవత్సరాలుగా ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల కాస్త స్టైల్‌ మార్చాడు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్తున్నాడు. 

ప్రస్తుతం స్పైడర్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న మహేష్‌బాబు ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్‌ అను నేను’ చిత్రం రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేశాడు. ‘స్పైడర్‌’ చిత్రం దసరాకు విడుదల కాబోతుండగా, ‘భరత్‌ అను నేను’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్‌ దశలో ఉండగానే మరో సినిమాను కూడా మహేష్‌బాబు సెట్స్‌ పైకి తీసుకు వెళ్లడం జరిగింది. తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు చేస్తున్నాడు. ఆ సినిమా నేడు ప్రారంబోత్సవం జరిగింది. దిల్‌రాజు, అశ్వినీదత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించి వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకుడు వంశీ భావిస్తున్నాడు. ఒకే సమయంలో మూడు సినిమాలను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లడం మహేష్‌బాబు కెరీర్‌లో ఇదే ప్రథమం. సూపర్‌ స్టార్‌ ఇలాగే వరుసగా చిత్రాలు చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

ఆ ఘ‌ట‌నే ఈ సినిమా క‌థ‌కు మూలం

నవదీప్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీపై విమర్శలు

ఆ ఘ‌ట‌నే ఈ సినిమా క‌థ‌కు మూలం