మంచు మనోజ్‌ చిత్రానికి అరుదైన గౌరవం

Okkadu Migiladu goes to International film festivals

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

మంచు మనోజ్‌ హీరోగా అజయ్‌ అండ్య్రూస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఈ చిత్రంలో మనోజ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో ఎల్టీటీఈ లీడర్‌ ప్రభాకరన్‌గా కనిపించబోతున్నాడు. మరో పాత్రలో స్టూడెంట్‌గా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు చేసిన ఒక ప్రకటన సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రాన్ని ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు తీసుకు వెళ్లబోతున్నట్లుగా వారు ప్రకటించారు.

1990లలో శ్రీలంకలో జరిగిన యుద్ద సన్నివేశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకోలేక పోయిన మంచు మనోజ్‌కు ఈ చిత్రం కూడా కమర్షియల్‌ సక్సెస్‌ ఇవ్వలేక పోయినా, నటుడిగా ఒక మంచి చిత్రాన్ని ఇస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రం తప్పకుండా అరిస్తుందని, మంచి పేరు తెచ్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరిన్ని వార్తలు:

లవకుమార్‌ ప్రకటన వచ్చింది

కల నెరవేరబోతుందన్న చిరంజీవి