శుభ్ర‌త‌ను అలవాటుగా మార్చుకుంటా…

prabhas-supporting-for-modi-swachhta-hi-seva

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ధాని మోడీ తల‌పెట్టిన స్వ‌చ్చ‌తా హీ సేవాకు ప్ర‌ముఖుల మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దేశాన్ని ప‌రిశుభ్రంగా ఉంచే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ద్వారా కోట్ల‌మందికి స్ఫూర్తిగా నిలవాల‌ని మోడీ అనేక రంగాల ప్ర‌ముఖుల‌కు స్వ‌యంగా లేఖ‌లు రాశారు. వారంతా స్వ‌చ్చ‌తా హీ సేవా కార్య‌క్ర‌మానికి పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇప్ప‌టికే త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స్వ‌చ్చ‌తా హీ సేవాకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌గా…

క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చీపురు ప‌ట్టుకుని ప‌శ్చిమ బాంద్రా వీధుల‌ను శుభ్రం చేసిన స‌చిన్ త‌నలానే అభిమానులంద‌రూ వీధుల‌ను ప‌రిశుభ్రంగా త‌యారుచేయాల‌ని పిలుపునిచ్చారు. తాజాగా బాహుబ‌లితో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్ర‌భాస్….ప్ర‌ధాని త‌న‌కు రాసిన లేఖ‌పై స్పందించారు. మోడీ ప్రారంభించిన స్వ‌చ్చ‌తా హీ సేవా విప్ల‌వానికి పూర్తిమ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాన‌ని ఆయ‌న ఫేస్ బుక్ లో వెల్ల‌డించారు. దేశాన్ని శుభ్రంగా ఉంచ‌డం ఒక ప‌నిలా కాకుండా….అల‌వాటుగా మార్చుకుంటాన‌ని ప్ర‌భాస్ ప్ర‌తిజ్ఞబూనారు. స్వ‌చ్చ‌త కోసం పాటుప‌డిన మ‌హాత్మాగాంధీ జ‌యంతి త్వ‌ర‌లోనే రానుంద‌ని, ఆ సంద‌ర్భాన్ని అవ‌కాశంగా తీసుకుని ప‌రిశుభ్ర‌తకు ప్ర‌చారం క‌ల్పించ‌డానికి త‌న వంతు కృషి చేస్తానని ఆయ‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.