మిత్రులే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

puri jagannadh posted video in twitter after SIT interrogation

డ్రగ్స్‌ వ్యవహారంలో సిట్‌ అధికారుల ముందు విచారణకు హాజరు అయిన పూరి జగన్నాధ్‌ అరెస్ట్‌ అయ్యాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇంకా పూరికి సంబంధించిన పలు విషయాలను, వివాదాలను మీడియా ప్రసారం చేసింది. కొన్ని టీవీ ఛానెల్స్‌ మరీ దారుణంగా పూరిపై అక్కస్సు వెళ్లగక్కాయి. సిట్‌ విచారణ ముగించుకుని ఇంటికి చేరుకున్న పూరి జగన్నాథ్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఆయన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. మీడియాలో వస్తున్న వార్తల కారణంగా తన తల్లి, భార్య, పిల్లలు నాలుగు రోజులుగా ఏడుస్తున్నారని, తాను ఏ తప్పు చేయకున్నా కూడా మీడియాలో వార్తలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని అన్నాడు.

మీడియాలో తనకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు. తన ప్రతి సినిమా సమయంలో టీవీ ఛానెల్స్‌కు చెందిన మిత్రులను కలుస్తూ ఉంటాను. కొందరు చాలా ఆప్తులు కూడా ఉన్నారు. కాని ఇప్పుడు వారే నా జీవితంను నాశనం చేసేలా వార్తలు సృష్టిస్తున్నారు, తనపై అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారు. ముందు ముందు కూడా మీడియా వారు మళ్లీ నన్ను కలవడం, వారిని నేను కలవడం ఉంటుంది. కాని ఆ విషయాన్ని గుర్తించకుండా తనపై దారుణంగా కథనాలు రాస్తున్నారు అంటూ పూరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పూరి ట్విట్టర్‌లో పెట్టిన వీడియోకు అనూహ్య స్పందన వస్తుంది. ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్ని ఆరోపణలు మీపై వచ్చినా మాకు మీపై ఉన్న అభిమానం తగ్గదు అంటూ అభిమానులు ట్వీట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

‘సీతయ్య’ దర్శకుడు ఆత్మహత్య యత్నం

మంచు లక్ష్మి రాజకీయ విమర్శలు

అరెస్ట్‌ అంటూ వార్తలు, సిట్‌ ఆఫీస్‌కు పూరి భార్య