మెగా ఫ్యామిలీతో రాజమౌళికి విబేధాలు లేవు

rajamouli launch chiru sye raa Narasimha reddy movie title logo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి 2’ చిత్రం విడుదలైన తర్వాత ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ మెగా ఫ్యామిలీతో తనకు విబేధాలు ఉన్నట్లుగా స్వయంగా చెప్పుకొచ్చాడు. ‘మగధీర’ చిత్రం సమయంలో మెగా ఫ్యామిలీకి దూరం అయినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో చెప్పింది కొద్దిగా అయితే సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం మరింత ఎక్కువ. మెగా హీరోలు అంటేనే రాజమౌళికి కోపం అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో మెగా ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పేందుకు ‘సైరా నరసింహారెడ్డి’ లోగో లాంచ్‌ కార్యక్రమంకు హాజరు అవ్వడం జరిగింది. 

మెగా ఫ్యామిలీకి మరియు రాజమౌళికి మద్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి స్వయంగా రాజమౌళిని కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ లోగో లాంచ్‌ కార్యక్రమంకు హాజరు అయితే సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టవచ్చని సూచించాడు. వెంటనే జక్కన్న ఓకే చెప్పడంతో, రామ్‌ చరణ్‌కు ఆ విషయాన్ని చేరవేయడం జరిగింది. దాంతో స్వయంగా రాజమౌళికి రామ్‌ చరణ్‌ పోన్‌ చేసి లోగో లాంచ్‌ కార్యక్రమంకు హాజరు కావాల్సిందిగా కోరడం జరిగింది. చరణ్‌ ఆహ్వానం మేరకు నేడు లోగో లాంచ్‌కు హాజరు అయ్యాడు. అలాగే ట్విట్టర్‌లో చిరంజీవి 151వ చిత్రం లోగో లాంచ్‌కు హాజరు కావడం గర్వంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు. ఈ సంఘటనతో మెగా రాజమౌళిల మద్య సఖ్యత ఉందని తేలిపోయింది.

మరిన్ని వార్తలు:

చిరుకు పవన్‌ శుభాకాంక్షలు

తెలుగు, తమిళంకు ఒక్కటే..!

అర్జున్‌ రెడ్డి మాటలు శృతిమించుతున్నాయి