నిత్యామీనన్‌, సాయిపల్లవి.. ఇప్పుడు ఈమె!

shalani-pandy-giving-her-own-voice-for-arjun-reddy-movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మత్ర ముగ్దులను చేసిన విషయం తెల్సిందే. ఈ అమ్మడు చేసిన సందడి నాలుగు వారాలు అవుతున్నా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘ఫిదా’ చిత్రంలో సాయి పల్లవి అద్బుతమైన నటనతో పాటు ఆమె పాత్రకు స్వయంగా ఆమె చెప్పుకున్న డబ్బింగ్‌ హైలైట్‌గా నిలిచింది.

తెలంగాణ యాసలో సాయి పల్లవి చెప్పిన డైలాగ్స్‌ అదిరిపోయాయి. ఇక అంతకు ముందు మరో  మలయాళి ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ కూడా మొదటి సినిమా ‘అలా మొదలైంది’ కోసం తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్‌ చెప్పిన విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా మంచి సక్సెస్‌ను దక్కించుకున్నారు. ఎవరైతే వెండి తెరపై కనిపిస్తారో వారే వినిపిస్తే బాగుంటుందని కొన్ని సార్లు అనిపిస్తుంది. సాయిపల్లవి, నిత్యామీనన్‌లు అదే ప్రయత్నించి సూపర్‌ హిట్‌ అయ్యారు. 

ఇప్పుడు సాయి పల్లవి, నిత్యామీనన్‌ల దారిలోనే మరో కొత్త హీరోయిన్‌ షాలిని పాండే సిద్దం అవుతుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఈ చిత్రంతో షాలిని పాండే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే టీజర్‌ ట్రైలర్‌ విడుదలైన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది.

చిత్రంలో నటించిన వారు అంతా కూడా దాదాపుగా డబ్బింగ్‌ చెప్పారు. ప్రస్తుతం హీరోయిన్‌తో  డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు. గత నెల రోజులుగా హీరోయిన్‌ డబ్బింగ్‌ నేర్చుకుందని, ప్రస్తుతం బాగా డబ్బింగ్‌ చెబుతుందని, మరో రెండు మూడు రోజుల్లో డబ్బింగ్‌ పూర్తి అవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. సాయి పల్లవి, నిత్యామీనన్‌ల మాదిరిగానే ఈ కొత్త ముద్దుగుమ్మ కూడా సక్సెస్‌ అవుతుందా చూడాలి.

మరిన్ని వార్తలు:

రానా సినిమా గురించి వర్మ ఏమన్నాడంటే..!