శృతిహాసన్‌ పరువు తీశారు!

Shruti Haasan removed from sanghamithra movie by directors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Shruti Haasan Removed From Sanghamithra Movie  By Directors

తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సంఘమిత్ర’ చిత్రం కోసం దాదాపు రెండు నెలల పాటు ట్రైనింగ్‌ తీసుకున్న తర్వాత శృతిహాసన్‌ ఆ చిత్రం నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ తనకు పూర్తిగా చెప్పలేదని, అలాగే కాల్షీట్ల విషయంలో కూడా వారికి సరైన అవగాహన లేదని, ఎన్ని రోజులు డేట్లు కావాలో సరిగా చెప్పక పోవడంతో తాను ఆ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్లుగా శృతిహాసన్‌ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నిర్మాణ సంస్థ స్పందిస్తూ శృతిహాసన్‌ తమ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్లుగా ప్రకటన చేసింది. అయితే నిర్మాణ సంస్థ మాత్రం అప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా ‘సంఘమిత్ర’ నిర్మాతల్లో ఒక్కరైన హేమ రుక్మిణి ఈ విషయంపై కుండబద్దలు కొట్టారు. శృతిహాసన్‌ తమ సినిమాకు సెట్‌ కాదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా వదిలేసుకుని ఆమెను సినిమా నుండి తప్పించినట్లుగా చెప్పుకొచ్చారు. తమ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, అలాంటి పాత్రను శృతిహాసన్‌ చేయలేదనే అభిప్రాయం అందరిలో కలిగిన తర్వాత ఆమెను తొలగించాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో శృతిహాసన్‌ పరువు పోయినట్లయ్యింది. ఇంత కాలం తానే సినిమా నుండి తప్పుకున్నట్లుగా చెప్పుకొచ్చిన శృతిహాసన్‌ నిర్మాత ప్రకటనతో గాలి పోయిన బెలూన్‌ మాదిరి అయ్యింది. ‘సంఘమిత్ర’ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

 ‘ఫిదా’ ట్రైలర్‌ రివ్యూ

‘డీజే’ గురించి ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే..!