మ‌రొకసారి వివాహ భోజ‌నంబు…

Vivaha-Bhojanambu-Remix-Son

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న మ‌హాన‌టి లో సావిత్రి వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త జీవితానికి సంబంధించిన అన్ని విష‌యాల‌ను చూపించ‌బోతున్నారు. ఇందులో భాగంగా సావిత్రి న‌టించిన కొన్ని కీల‌క సినిమాల గురించి మ‌హాన‌టిలో ప్ర‌స్తావించ‌నున్నారు. ఆ క్ర‌మంలో సావిత్రి న‌టించిన మాయాబ‌జార్ లో సూప‌ర్ హిట్ట‌యిన వివాహ భోజ‌నంబు సాంగ్ ను మ‌హాన‌టిలో రీమిక్స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. వివాహ భోజ‌నంబు పాట‌ను ఘంట‌శాల సంగీత ద‌ర్శ‌క‌త్వంలో మాధ‌వ‌పెద్ది స‌త్యం పాడారు. ఎస్వీరంగారావు, సావిత్రి ఆనాటి  పాట‌లో న‌టించ‌గా…మ‌హాన‌టిలోని పాట‌లో ఎస్వీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్న మోహ‌న్ బాబు, సావిత్రి పాత్ర‌లో న‌టిస్తున్న కీర్తి సురేశ్ క‌నిపించనున్నారు. వివాహ భోజ‌నంబు పాట‌ను ఆధునిక టెక్నాల‌జీ సాయంతో అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించాల‌ని  మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.

అప్ప‌టి టెక్నాల‌జీని అంతా ఉప‌యోగించుకుని తీసిన మాయాబ‌జార్ లోని పాట‌…ఆ రోజుల్లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. అప్పుడే కాదు…వివాహ భోజ‌నంబు పాట‌…ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీనే..అందుకే మ‌హాన‌టిలో ఆ పాట‌ను తిరిగి చిత్రీక‌రించితే..సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అవుతుంద‌ని సినిమా యూనిట్ భావిస్తోంది. మ‌హాన‌టి ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. కీర్తిసురేశ్, మోహ‌న్ బాబు, ద‌ర్శ‌కులు క్రిష్, త‌రుణ్ భాస్క‌ర్ పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. మాయాబ‌జార్ ద‌ర్శ‌కుడు కె.వి.రెడ్డి పాత్ర‌లో క్రిష్, ఆయ‌న వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ న‌టిస్తున్నారు.