ఎంతటి దారుణం: తల్లి సాయంతో తండ్రి.. కన్న కూతురి పై అఘాయిత్యం…

కలికాలం అంటే బ్రహ్మం గారు చెప్పినట్లు రోజురోజుకు భయంకరమైన విషయాలను వింటున్నాం,చూస్తున్నం.కొన్ని ఘటనలు వింటుంటే సొంత తల్లిదండ్రుల వద్ద కూడా రక్షణ కరువైనట్లే అనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘోరమే చోటు చేసుకుంది. కన్న తండ్రే తల్లి సహకారంతో కూతురు పై అఘాయిత్యం చేసిన ఘటన వెలుగు చూసింది. అయితే ఆయన మంచి పదవులు అనుభవించిన అధికారి. కన్ను కూతురు అన్న విచక్షణను కోల్పాయి నీచానికి ఒడిగట్టాడు.

అయితే రాష్ట్రంలోని మోరెనా జిల్లాలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో చిన్నకూతురు 18 ఏళ్లు. కాగా ఆ అమ్మాయి స్థానికంగా ఓ యువకుడితో ప్రేమలో పడింది. కూతురికి బుద్ధిచెప్పాల్సిన తల్లిదండ్రులు.. కన్న కూతురిపట్ల నీచంగా ప్రవర్తించారు. ఈ విషయం పోలీసు స్టేషన్‌కు చేరడంతో.. విచారణలో దారుణమైన విషయాలు వెలుగుచూశాయి. మార్చి 26న తొలిసారి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. బాధితురాలు వంట చేస్తుండగా.. బెడ్‌రూంలోకి లాక్కెళ్లి తాళ్లతో కట్టేసి.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

అయితే ఆ సమయంలో ఆ యువతి అరుస్తుంటే.. ఆ అరుపులు వినిపించకుండా తల్లి… కూతురి నోరు అడ్డుపెట్టిన సౌండ్ రానీకుండా చేయడం ఇంకా మరీదారుణం. కాగా ప్రేమ వ్యవహారం ఎందుకు ? అని మందలిస్తూనే.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. పెళ్లికి ముందే ఇలా జరిగితే.. రేపు నీకు పెళ్లైన తర్వాత ఆ విషయంలో పెద్దగా కష్టంగా ఉండదని చెప్పాడని సమాచారం. అంతేకాకుండా ఏప్రిల్ 10వ తేదీన ఆ యువతి… ఇంట్లో సూటిపోటి మాటలు, వేధింపులు భరించలేక.. సమీపంలోని ఆంటీ వాళ్ల ఇంటికి వెళ్లి తలదాచుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న తండ్రి.. కూతుర్ని తీసుకొచ్చి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక తనపై జరుగుతోన్న దారుణాన్ని బాధితురాలు పెద్దక్కకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. ఆగ్రహంతో ఊగిపోయిన అక్క.. పుట్టింటికి వచ్చి.. తల్లిదండ్రులను గట్టిగా మందలించింది. దీంతో చెల్లిని తనతో తీసుకెళ్లిపోయింది.. అంతే కాదు.. పోలీసులకు కూడా సమాచారం అందించింది. దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరినీ అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.