భాగ్యనగరంలో తీవ్ర విషాదం.. భవనం గోడ కూలి ముగ్గురు మృతి.

tragedy in Bhagyanagar, three people died when wall of building collapsed.
tragedy in Bhagyanagar, three people died when wall of building collapsed.

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ గోడ కూలి ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి అడ్డగుట్ట కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలింది. ఆ భవనం గోడ కూలడంతో ఏకంగా ముగ్గురు మృతి చెందారు.

ఐదవ అంతస్తు గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ముగ్గురు మరణించగా మరో ఇద్దరికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత మూడు రోజులుగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెర్పు లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలోనే గోడ తడిసి కూలిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.