కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

మృతులు సిరివార తాలూకాలోని కల్లూరు గ్రామానికి చెందిన బసవరాజ్ మొసలి, భీమవ్వ మొసలి మరియు ఎనిమిదేళ్ల నరేష్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు దూరపు బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కుర్ది నుంచి గ్రామానికి బైక్‌పై వెళ్తున్నారు.

బైక్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.