బొగ్గు గనిలో ప్రమాదకర ఘటన

బొగ్గు గనిలో ప్రమాదకర ఘటన

బొగ్గు గనిలో ప్రమాదకర గ్యాస్ వెలువడి 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనా నైరుతి ప్రాంతం చాంగ్‌కింగ్‌లోని బొగ్గు గనుల్లో జరిగిన ఘోర ప్రమాదంలో 18 మంది పిల్లలు చనిపోయినట్టు చైనా అధికారిక మీడియా జున్హు శనివారం వెల్లడించింది.

డయాషుయిడాంగ్ బొగ్గు గనిలో శుక్రవారం సాయంత్రం అధిక స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడటంతో పిల్లలు మరణించారని తెలిపింది. గనుల్లో ఇంకా రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

గనుల్లోపల పరికరాలు, సామాగ్రి దెబ్బతినడంతో రెండు నెలలుగా దీనిని మూసివేశారని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. ప్రమాద సమయానికి గనిలో మొత్తం 23 మంది మైనర్లున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్టు ధ్రువీకరించారు. మిగతావారి గురించి గాలిస్తున్నారు.

రెండు నెలల వ్యవధిలోనే ఇక్కడ చోటుచేసుకున్న రెండో ప్రమాదం కావడం విచారకరం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బొగ్గు గనులు చైనాలోనే ఉన్నాయి. సెప్టెంబరులో చాంగ్కింగ్ సాంగ్జావో బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది మరణించారు. వీరంతా మైనర్లే కాగా.. అధిక స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడటంతో ఊపిరాడక చనిపోయారు.

ఈ గనులను 1975లో గుర్తించగా.. 1998 నుంచి ఓ ప్రయివేట్ సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఏడాదికి 120,000 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నట్టు జున్హు ప్రకటించింది. ఇదే ప్రాంతం వద్ద 2013లో ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు భారీగా వెలువడటంతో ప్రమాదం సంభవించింది.

గత నెలలో షాన్‌జీ ప్రావిన్సులో ఉన్న ఓ బొగ్గుగనిలో విషవాయువు విడుదలైన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గనిలో పని చేస్తున్న మరో నలుగురు వ్యక్తుల ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఓ ప్రైవేటు కంపెనీ బొగ్గు గనిలో బుధవారం 42 మంది పని చేస్తుండగా మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో విషవాయువు విడుదలైంది.