ప్రముఖ యాంకర్ ఝాన్సీ మాజీ భర్త, వర్ధమాన సినీ నటుడు జోగి నాయుడు మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. జోగి బ్రదర్స్ గా ఫెమస్ అయినా అన్నదమ్ములలో ఒకరయినా జోగి నాయుడు తొలుత ఝాన్సీని పెళ్లి చేసుకున్నాడు, అయితే కొన్ని మనస్పర్థల వలన వారు విడిపోయారు. అయితే నిన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో తన స్వగ్రామమైన విశాఖ జిల్లా చెర్లోపాలెంకి చెందిన సౌజన్యని వివాహం చేసుకున్నాడు. జోగినాయుడు ఝాన్సీతో విడాకులు తీసుకున్న తరువాత కొన్నాళ్లు సింగిల్గానే ఉన్నాడు. వీరి వివాహానికి పరిశ్రమకి సంబంధించి కొందరు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది.