శ్రీ ముఖి విరామం అందుకే ?

బిగ్ బాస్ సీజన్ 3 సందడి మొదలైంది. మూడో సీజన్‌ జూలై రెండో వారంలో ప్రారంభం కానుండగా హోస్ట్‌గా కింగ్ నాగార్జున దాదాపు ఖాయమయ్యారు. దీనిపై త్వరలో అఫీసియల్ అనౌన్స్ మెంట్ రానుండగా ఈ షోలో పాల్గొనబోయే 17 మంది కంటెస్టెంట్‌లు ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ చాలా వీక్ అనే చెప్పాలి. ఆ ప్రభావం రేటింగ్స్‌పై పడింది. అందుకే సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారట. దీనిలో భాగంగా పాపులర్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌గా ఖాయమైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే శ్రీముఖి ఇటీవల పటాస్ షో నుండి బయటకు వచ్చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ‘పటాస్’ షోకి బ్రేక్ ఇస్తున్నా.. ప్రొడక్షన్ హౌస్ అనుమతితో షో నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నా’ అని ప్రకటించిన శ్రీముఖి పటాస్ ‌ని పూర్తిగా వదిలేయడం లేదని ఆమె కొన్నాళ్లు పాటు పటాస్‌కి బ్రేక్ ఇచ్చింది బిగ్ బాస్ షో కోసమే అంటూ వార్తలు ఊపందుకున్నాయి.