AP Politics: నేటి నుంచే “ఆడుదాం ఆంధ్రా”… 47 రోజుల పాటు క్రీడా సంబరం

AP Politics:
AP Politics: "Let's play Andhra" from today... sports festival for 47 days

ఇవాళ్టి నుంచే ఆడుదాం ఆంధ్రా ప్రారంభం కానుంది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం జగన్. గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ లో ప్రారంభించనున్నారు సీఎం జగన్‌… ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరుగుతాయి. అంటే ఏపీలో 47 రోజుల పాటు క్రీడా సంబరం జరుగనుందన్న మాట. గ్రామ వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరుగనున్నాయి.

ఈ మేరకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో క్రీడాకారులు 34.19 లక్షలు, ప్రేక్షకులు: 88.66 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తంగా కోటి 22 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థాయిలలో బహుమతులు అందించనుంది ఏపీ సర్కార్‌. బహుమతుల కోసం 12 కోట్లకు పైగా నగదు ఇవ్వనుంది ప్రభుత్వం. జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించటం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్పూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టారు.