చంద్రబాబు నాయుడు బస్సు ఫై చెప్పు, రాళ్ల దాడి

చంద్రబాబు నాయుడు బస్సు ఫై చెప్పు, రాళ్ల దాడి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బస్సు ఫై చెప్పు, రాళ్ల దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో పర్యటించడానికి వెళ్ళినపుడు ఈ దారుణం జరిగింది. అయితే ఈ ఘటన ఫై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేసారు. ఉద్దేశపూర్వకంగానే, అంతా ప్లాన్ ప్రకారమే దాడి చేసారని అన్నారు. ఈ నెల 5 న జరగబోయే సమావేశం ఫై చర్చలు జరిపారు. అయితే అమరావతి ఫై జరగనున్న ఈ సమావేశానికి వైసీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను, మేధావులను, ప్రజా సంఘాలు, రాజధాని రైతులు, ప్రజలను పిలవాలని నిర్ణయించారు.

అయితే రాజధాని ఫై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు సరికాదని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే రాజధాని అమరావతి కోసం చంద్రబాబు నాయుడు అయిదేళ్ల సమయం తీసుకోలేదని తెలిపారు. రెండున్నరేళ్ల సమయం మాత్రం తీసుకున్నామని అన్నారు. రాజధాని ఏ చంద్రబాబు ఒక్కరి కోసమో కాదని, అయిదు కోట్ల ప్రజలందరికోసం అని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే చంద్రబాబు కాన్వాయ్ ఫై దాడి జరిగిన విషయం లో టీడీపీ నేతలు ఆగ్రహంగా వున్నారని తెలుస్తుంది.