కరోనాతో బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ మృతి

కరోనాతో బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ మృతి

బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ (69) కరోనాతో మంగళవారం రాత్రి మరణించారు. గ‌త కొద్ది రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ కావ‌డంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. సునీల్ కుమార్ మృతికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. స‌మాజిక సేవ ఎంతో చేసేవార‌ని, ఆయ‌న కృషి వ‌ల్ల స‌మాజంలోని అన్ని వ‌ర్గాల నుంచి గౌర‌వం ల‌భించింద‌ని నితీష్ పేర్కొన్నారు. సునీల్ కుమార్ మ‌ర‌ణం తీర‌ని లోట‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ కుమార్ అన్నారు.

ఇక దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిదే. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ్యాప్తి మ‌రింత ప్ర‌బ‌ల‌కుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తో పాటు కేంద్ర ప్రతినిధి బృందం బీహార్ రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.