తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు నాయుడు

తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పై, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామనే గర్వంతో వైసీపీ నేతలందరూ కూడా తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని, వైసీపీ పార్టీ ఫ్యాక్షనిస్టు ధోరణి రోజు రోజు కి పరాకాష్ట కి చేరుతుందని చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండి కూడా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇప్పటికి కూడా రాజధాని అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలు, రైతుల జీవితాలతో ఆదుకుంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇకపోతే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులపైన తమ దారుణమైన దుర్బుద్ధిని చూపిస్తున్నారని, అంతేకాకుండా దాదాపుగా 3 నెలలుకు మించి వెయిటింగ్‌లో ఉంటే, వారికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించేది లేదని చెప్పడం దారుణమని చంద్రబాబు నాయుడు అన్నారు. ” పోస్టింగ్‌లు ఇవ్వకుండా వందలాది మంది పోలీసులను 8 నెలలుగా తీవ్రంగా వేధిస్తు, వారికి కావాలనే జీతాలు రాకుండా చేస్తుందని, ఇంతటి పాగా సాధింపు చేర్యాలకు పాల్పడుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వపు దుర్మార్గపు చేయాలనీ” చంద్రబాబు పిలుపునిచ్చారు.