శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం

శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలుర ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో పూర్వ విద్యార్థి తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి స్పందించి రూ.3.50 కోట్లతో భవనం నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

ప్రస్తుతం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. దీనికి గుర్తింపుగా సుభాష్‌రెడ్డి తల్లిదండ్రుల పేరు ‘తిమ్మయ్యగారి సుశీల–నారాయణరెడ్డి జెడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్, బీబీపేట పాఠశాల’గా ఖరారు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.