గర్భం దాల్చిన నలుగురు విద్యార్థినులు

Four students became pregnant

ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఆదివాసీ సంక్షేమాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు చెందిన నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థినులు తిరిగి ఆదివారం హాస్టళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులందరికీ హాస్టల్‌ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించింది. రెండు హాస్టళ్లలోని నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో హాస్టల్‌ సిబ్బంది జిల్లా శిశు సంక్షేమ కమిటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఆ నివేదికను అందుకున్న సీడబ్ల్యూసీ ప్రతినిధులు పోలీసు కమిషనర్‌ సత్యజిత్‌ మహంతికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.