కత్తి మహేష్‌పై కేసు నమోదు

Hindu caste activists files case against kathi mahesh

గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న కత్తి మహేష్‌ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఎప్పటిలాగా ఈసారి పవన్‌ కళ్యాణ్‌ ఇష్యూతో కాకుండా మరో ఇష్యూతో ఈయన మీడియాలో ప్రముఖంగా వస్తున్నాడు. కత్తి మహేష్‌ ఇటీవల ఒక మీడియా ఛానెల్‌ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో పాల్గొని హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడటం జరిగింది. దాంతో హిందువులు ఈయనపై కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. హిందు జనశక్తి కార్యకర్తలు పలువురు కత్తి మహేష్‌పై ఈ కేసును ఫైల్‌ చేయడం జరిగింది. కేసును స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. గతంలో కూడా కత్తిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇది కాస్త బలమైన కేసు అంటూ విశ్లేషకులు అంటున్నారు.

ఇంతకు కత్తి ఆ టీవీ ఛానెల్‌ చర్చ కార్యక్రమంలో ఏమన్నాడు అంటే.. దైవం గురించి చర్చ జరుగుతున్న సమయంలో కత్తి మహేష్‌ మాట్లాడుతూ రామాయణం అనేది ఒక కథ, ఆ కథలో హీరో పాత్రధారుడు రాముడు. ఆ రాముడు ఎంత ఆదర్శవంతుడో అంతే దగుల్బాజీ వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీత చివరి వరకు రాముడితో ఉండి ఉంటే కథ సక్సెస్‌ అయ్యేది. రాముడితోనే సీత ఉంటే ఖచ్చితంగా న్యాయం జరిగేది అంటూ రామాయణంపై తన సోది పురాణం చెప్పుకొచ్చాడు. రామాయణం గురించి కత్తి మహేష్‌ అలా మాట్లాడటంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కత్తి మహేష్‌ ఈ కేసులో త్వరలోనే అరెస్ట్‌ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. కత్తి మహేష్‌ ఈ విషయమై ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.