ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో కళాళాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మంజునాథ రెడ్డి అనే విద్యార్ధి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వగ్రామం మైదుకూరు గ్రామంలోని గణపతి నగర్‌. తల్లిదండ్రులు పేర్లు లింగా రెడ్డి, సరస్వతి, వీరికి ఒక కుమార్తె, కుమారుడు మంజునాథ రెడ్డి ఉన్నారు. హాజరు తక్కువ కావడంతో ఎగ్జామ్స్‌ కు అధికారులు అనుమతించలేదని మనస్థాపం చెంది మంజునాథ రెడ్డి ఆత్మ హత్యకు పాల్పడినట్లు స్థానిక సమాచారం. ఘటనా స్థలానికి చేరులకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.