ధోనీ గురించి అడ‌గొద్దు

laxmi-raai-gives-clarity-about-her-relationship-with-ms-dhoni

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ..సాక్షి సింగ్ తో వివాహానికి ముందు చాలా ప్రేమాయ‌ణాలే న‌డుపుతున్న‌ట్టు వార్త‌లొచ్చేవి. అన్నింటిలోకి ధోనీ పై ఎక్కువ‌గా పుకార్లు సాగింది ద‌క్షిణాది న‌టి ల‌క్ష్మీరాయ్ తో ఎఫైర్ గురించే. 2008లో ఐపీఎల్ ప్రారంభ‌మైన తొలిరోజుల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ధోనీ కెప్టెన్ గా ఉన్న సమ‌యంలో….ఆ టీమ్ కు ల‌క్ష్మీరాయ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉంది. ఆ క్ర‌మంలోనే వారిద్ద‌ర‌కి ప‌రిచ‌యం ఏర్ప‌డి..ప్రేమ‌గా మారింద‌ని, వారిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లిచేసుకోబోతున్నార‌ని జోరుగా వార్త‌లొచ్చాయి. త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ…వారిద్ద‌రూ విడిపోయారు. రెండేళ్ల త‌రువాత ధోనీ సాక్షి సింగ్ ను వివాహం చేసుకున్నాడు. వారికిప్పుడు జీవా అనే కూతురు కూడా ఉంది. అయితే ల‌క్ష్మీరాయ్ తో ధోనీ ఎఫైర్ ముగిసి ప‌దేళ్లు కావొస్తున్నా…ఇప్ప‌టికీ మీడియా ఆమెను ధోనీ గురించి అడుగుతూనే ఉంటుంది.

తాజాగా జూలీ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్న ల‌క్ష్మీరాయ్ స్పాట్ బాయ్ అనే వెబ్ సైట్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో ధోనీతో ఎఫైర్ పై సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చింది. మొద‌ట ఆమెను ధోనీ గురించి అడ‌గ‌గానే…ధోనీ ఎవ‌రు అంటూ ఎదురు ప్ర‌శ్నించి షాకిచ్చింది. త‌ర్వాత త‌మ అనుబంధంపై నోరుమెదిపింది. ఇది చాలా కాలం కింద‌టి ముచ్చటని..ఇప్పుడు ధోనీ వివాహం చేసుకుని ఆనందంగా ఉన్నాడ‌ని, త‌న‌కు పిల్ల‌లు కూడా ఉన్నార‌ని, ధోనీ గురించి త‌న‌ను, త‌న గురించి ధోనీని అడ‌గ‌డానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ల‌క్ష్మీరాయ్ అభిప్రాయ‌ప‌డింది. కొన్ని విష‌యాలు వ‌ర్కౌట్ కావ‌ని, వాటిని వ‌దిలేసి ముందుకు సాగాల్సిందే అని ఆమె వేదాంతం మాట్లాడింది. త‌మ అనుబంధం గురించి మీడియా అతిగా ఫోక‌స్ చేసింద‌ని, త‌మ పెళ్లి జ‌ర‌గ‌బోతోందంటూ క‌థ‌నాలు అల్లేశార‌ని, ఇది త‌మ‌పై దుష్ప్ర‌భావం చూపింద‌ని, తామిద్ద‌ర‌మూ ఈ పుకార్ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని ల‌క్ష్మీరాయ్ గుర్తుచేసుకుంది. ధోనీ అంటే ఇప్ప‌టికీ గౌర‌వ‌ముంద‌ని, అందుకే ఆ వివ‌రాల్లోకి వెళ్ల‌డం లేద‌ని ల‌క్ష్మీరాయ్ ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చింది.