మహర్షి మూవీ ప్రివ్యూ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ భారీ చిత్రం మ‌హ‌ర్షి. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో మ‌హేష్ స్టూడెంట్‌గా, బిజినెస్ మేన్‌గా, రైతుగా త్రీ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నారు. ఇది మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్‌ లేకుండా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ మూవీ రన్ టైమ్ విష‌యానికి వ‌స్తే… 5 నిమిషాల తక్కువ మూడు గంటల నిడివి. ఈ లెంగ్తీ రన్ టైమ్ సినిమాకు ప్ల‌స్ అవుతుందా..? మైన‌స్ అవుతుందా..? అని ఫ్యాన్న్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట. కానీ.. నిర్మాత మాత్రం నిడివి అనేది స‌మ‌స్యే కాదు. ఈ సినిమా ఖ‌చ్చితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మహేష్ బాబుకి మే నెల సెంటిమెంటు వున్నా అల్లరి నరేష్ సుడిగాడు ఇందులో వున్నాడు కాబట్టి భారీ హిట్ ఖాయం అంటున్నారు.