నీ యవ్వా అంటూ ఒక వ్యక్తి పై రెచ్చిపోయిన మంచు లక్ష్మి !

నీ యవ్వా అంటూ ఒక వ్యక్తి పై రెచ్చిపోయిన మంచు లక్ష్మి !
Latest News

మంచు లక్ష్మి గురించి పరిచయం అవసరం లేదు. మోహన్ బాబు కూతురుగానే కాకుండా యాక్టర్స్ గా, టెలివిజన్ హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా, బోటిక్ నిర్వాహకురాలుగా ఎంతో పాపులర్ అయింది. ఇక మంచు లక్ష్మి తాజాగా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇచ్చారు . ఢిల్లీ నేతల సమక్షంలో మంచు లక్ష్మి బిజెపి పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. మంచు లక్ష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూనే ప్రేక్షకులకు చేరువలో ఉంటారు.

నీ యవ్వా అంటూ ఒక  వ్యక్తి పై రెచ్చిపోయిన మంచు లక్ష్మి !
Manchu Lakshmi

అయితే ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఓ వీడియోతో తెగ ట్రోల్ అవుతున్నారు. రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా ఈవెంట్ కి వెళ్ళినటువంటి మంచు లక్ష్మి అక్కడ కొంతమంది వ్యక్తులపై ఆమె సీరియస్ అవుతూ చేయి చేసుకున్నారు. ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో కెమెరాకు ఓ వ్యక్తి అడ్డు వచ్చాడు. దీంతో మంచి లక్ష్మి సీరియస్ అయ్యి ఒక్కసారిగా అతనిపై చేయి చేసుకుంది.

ఆ తర్వాత మరో వ్యక్తి కూడా కెమెరా ముందు నుంచి వెళ్లడంతో తీవ్ర అసహనానికి గురైన మంచు లక్ష్మి ఇంటర్వ్యూ అవుతుంది కదా కెమెరా వెనుక నుంచి వెళ్లాలి ముందు నుంచి కాదు అని ఆ వ్యక్తిని పిలిచి మరి చెప్పింది. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో మంచు లక్ష్మిపై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. అంత గొప్పనైన ఈవెంట్ లో మంచు లక్ష్మి ఇలా చేయడం ఏంటని, అంతేకాకుండా ఒక వ్యక్తిపై చేయి చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వీడియోపై మంచు లక్ష్మి ఎలా స్పందిస్తారో చూడాలి.