మెగా బ్రదర్ నాగబాబు సంచలనమైన వాఖ్యలు

మెగా బ్రదర్ నాగబాబు సంచలనమైన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జనసేన పార్టీ కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబు తాజాగా కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. ఈమేరకు నాగబాబు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా కొన్ని వాఖ్యలు చేశారు. అయితే “ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు” అంటూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పై జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలో సీఎం జగన్ మరియు చంద్రబాబు ని ఉద్దేశించి నాగబాబు ఈ వాఖ్యలు చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ వాఖ్యలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ నాగబాబు పై కొందరు సెటైర్లు వేస్తుండగా మరికొందరు మాత్రం నాగబాబు పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాగబాబు ట్వీట్ చూసిన ఒక వైసీపీ అభిమాని ఒకరు స్పందిస్తూ…”వారిలో ఒకరు చంద్రబాబు మరొకరు పవన్ కల్యాణ్.. అంతేగా? నాగబాబు గారూ” అని వాఖ్యానించగా, మరొకరు “అసలు వారు మనుషులే కాదు, రెండు మాఫియాలు ఉన్నాయి.. వారికి అనైతిక మీడియా మద్దతు తెలుపుతోంది” అని కామెంట్ చేశారు. ఇక మరికొందరైతే… “మీరేం బాధపడకండి సర్.. ఎందుకంటే మీరు తెలంగాణలో ఉంటున్నారు.. మీరు అప్పుడప్పుడు ఏపీలో పర్యటిస్తున్నారంతే…!” అంటూ వాఖ్యానించారు.