నాగార్జున ఫాం హౌస్ లో విషాదం !

Nagarjuna Farmhouse workers died due to Current Shock

సినీ నటుడు నాగార్జున ఫామ్ హౌస్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివారులోని పాపిరెడ్డి గూడ ప్రాంతంలో నాగార్జునకు ఫామ్ హౌస్ ఉంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట రాజు(32), దుర్గ (30) దంపతులు ఈ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్నారు. రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో పొలంలోనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. విద్యుత్ ప్రవహిస్తున్న తెగిపడిన వైర్ ను గమనించక దాన్ని తాకాడు. కరెంట్ షాక్ తో భర్త విలవిల్లాడుతుంటే, అతన్ని కాపాడేందుకు దుర్గ ప్రయత్నించగా, ఆమెకూ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరణంలోనూ ఆ జంట తమ దాంపత్య బంధాన్ని వీడలేదు. విద్యుదాఘాతానికి గురైన భర్తను కాపాడబోయి భార్య కూడా తనువు చాలించడం చూపరులని కలచివేస్తోంది.