కోలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ నయనతార కీలక నిర్ణయం

కోలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ నయనతార కీలక నిర్ణయం

కోలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ నయనతార కీలక నిర్ణయం తీసుకొంది. ఈ భామ వెజిటేరియన్‌గా మారబోతుంది. అయితే ఈ భామ ఈ నిర్ణయం కూడా సినిమా కోసమే తీసుకుంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా టాప్‌ ప్లేస్‌లో ఉన్న నయనతార తన పాత్ర కోసం ఎంతకష్టమైన పడుతుంది. అయితే నటిగా ఏ పాత్రకైనా జీవం పోసే ఈ భామ ప్రమోషన్‌ విషయంలో మాత్రం దూరంగా ఉంటుంది.

తాజాగా ఈ భామ తమిళ సినిమా కోసం తన ఆహారపు అలవాట్లు మార్చుకుంటుందట. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్‌ సినిమాలో నటిస్తున్న ఈ భామ తరువాత ముక్తి అమ్మన్‌ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమాలో నయనతార దేవత కన్యా కుమారిగా కనిపించనుంది. ఆ పాత్రలో నటించేందుకు నిష్టగా ఉండాలని భావించిన నయనతార  ముక్తి అమ్మన్‌ షూటింగ్‌ జరిగినన్ని రోజులు నాన్‌ వెజిటేరియన్‌ తినకూడదని నిర్ణయించుకుంది.

గతంలో శ్రీరామరాజ్యం సినిమా షూటింగ్ సమయంలోనూ ఇలాగే చేసింది నయనతార. ఆ సినిమాలో సీత పాత్రలో నటించిన నయనతార ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవల టాలీవుడ్‌లో ప్రస్టిజీయస్‌గా తెరకెక్కిన మెగాస్టార్‌ సినిమా సైరా నరసింహారెడ్డిలోనూ కీలక పాత్రలో నటిచింది నయనతార. భారీ చిత్రాల్లో నటిస్తున్నా ఆ సినిమాప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరుకాకపోతుండటంతో నయనతారకు భారీగా అవకాశాలు రావటం లేదన్న వాదన ఉంది. ముక్తి అమ్మాన్తో పాటు ప్రస్తుతం నేట్రికన్‌ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాలు 2020లో తెరమీదకు రానున్నాయి.