అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరూ చిత్రాల ఫై భారీ అంచనాలు

సంవత్సరానికి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతికి ఈ సారి బరిలో భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ముఖ్యంగా అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరూ చిత్రాల ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు మొదటగా జనవరి 12 న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు దర్శక నిర్మాతలు. అయితే రెండు భారీ చిత్రాలు ఒకే రోజున విడుదల అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారని సినీ పెద్దలు చెప్పడం తో సరిలేరు నీకెవ్వరూ చిత్రం జనవరి 11 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్లు ప్రేక్షకులకి, అభిమానులకి గందరగోళాన్ని సృష్టించాయి. నూతన సంవత్సర పోస్టర్లలో విడుదల తేదీని ప్రకటించలేదు. అంతేకాకుండా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఒకే ధోరణిని అనుసరిస్తున్నాయి. ఈ సారి సంక్రాంతికి అల్లు అర్జున్ మొదటగా థియేటర్లలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అందుకే మహేష్ కూడా తెలివిగా పోస్టర్ల ఫై విడుదల తేదీని ప్రకటించలేదు. మరి ఇలాంటి పరిణామం సినీ చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పాలి. మరి ఏ చిత్రాలు మరొకసారి విడుదల తేదీల ఫై అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా వుంది.