పింక్ రీమేక్‌తో మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ

పింక్ రీమేక్‌తో మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో కనిపించిన పవన్ ఆ తరువాత పూర్తి స్థాయి రాజకీయాలలోకి వెళ్ళిపోయారు. అయితే బాలీవుడ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించిన పింక్ రీమేక్‌తో మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతునట్టు, సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్ధే హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారట.

అయితే ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 నుంచి 30 రోజుల సమయం మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యిందని, షూటింగ్ కోసం పవన్‌కి ప్రత్యేక విమానం అరేంజ్ చేయబోతున్నారని టాక్ వచ్చినా సినిమా షూటింగ్ గురుంచి కానీ, అప్డేట్స్ గురుంచి కానీ చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారాన్ని లీక్ చేయడంలేదు. అయితే ఈ సీనిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందని, మే 23న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అయితే త్వరలోనే టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుందట.