నాలుగు పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్ పై దబాంగ్ ఢిల్లీ గెలుపు

నాలుగు పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్ పై దబాంగ్ ఢిల్లీ గెలుపు

ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్న తొలి జట్టుగా ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో  రికార్డు నెలకొల్పిన దబాంగ్ ఢిల్లీ గురువారం పట్నా పైరేట్స్‌ పై విజయం సాదించింది. జైపూర్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 43-39 తేడాతో పట్నాపై గెలుపు సాదించింది.

స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ మ్యాచ్ లో జోరు చూపించిన గెలిపించలేకపోయాడు. 25 సార్లు రైడ్‌కి వెళ్లిన పర్దీప్ ఏకంగా 19 పాయింట్లను సాధించి ఆకట్టుకున్నాడు. ఆఖర్లో డిఫెన్స్ చేసిన తప్పిదాలతో పుంజుకున్న దబాంగ్ ఢిల్లీ డిఫెన్స్ చేసిన తప్పిదాల వల్ల మ్యాచ్‌ని గెలిచింది .

దబాంగ్ ఢిల్లీ యువ ఆటగాళ్లకి అవకాశమివ్వడంతో  రైడర్ విజయ్ మ్యాచ్‌లో 9 సార్లు రైడ్‌కి వెళ్లి 12 పాయింట్లు సాదించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంకా డిఫెండర్ అనిల్ కుమార్ కూడా  4 పాయింట్లు సాదించాడు . ప్లేఆఫ్‌ బెర్తు ఖాయం అయినందువల్ల దబాంగ్ ఢిల్లీ ఇలా యువ ఆటగాళ్లకి అవకాశమిచింది. నాలుగు పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్ ఈ ఓటమితో మరింత వెనకబడిపోయింది