రాంగోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ నాయకులు

రాంగోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ నాయకులు

ప్రముఖ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు… ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే వివాదాస్పదంగా మారిపోయిందని చెప్పాలి. కాగా ఇప్పటికే విడుదలైనటువంటి రెండు ట్రైలర్లు కూడా ఎన్నో వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారిపోయిందని చెప్పాలి. ఇకపోతే ఏపీలోని రాజకీయ నాయకులందరినీ కూడా తన చిత్రంలో వాడేసుకున్నాడని, అందరు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మరికొద్ది రోజుల్లో విడుదలవనున్న ఏ చిత్రం మరిన్ని వివాదాలకు తెరతీస్తుందో అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా నవంబర్ 29 న విడుదలవనున్న ఈ చిత్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే పక్కాగా అర్థమవుతుంది. అయితే ఈ చిత్ర రెండవ ట్రైలర్ చూసాక తెలుగు తమ్ముళ్లు అందరు కూడా ఈ చిత్ర విడుదలని అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆర్జీవీ తెరకెక్కించిన ఈ చిత్రం విడులవుతుందా అనేది ఆసక్తిగా మారిపోయిందని చెప్పాలి.

రాంగోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ నాయకులు - Telugu Bullet31
రాంగోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ నాయకులు - Telugu Bullet
రాంగోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ నాయకులు - Telugu Bullet
రాంగోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకీయ నాయకులు - Telugu Bullet