`అల వైకుంఠ‌పుర‌ములో` పై పడిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ఒత్తిడి

`అల వైకుంఠ‌పుర‌ములో` పై పడిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ఒత్తిడి

‘అల.. వైకుంఠ‌పుర‌ములో’ సినిమాకి ముందు నుంచీ ప్ర‌మోష‌న్స్ పీక్స్‌లో జ‌రుగుతున్నాయి. సినిమా విడుద‌ల‌కు మ‌రో నెల రోజులే స‌మ‌యం ఉంది. ఇప్పుడు టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖ‌రారైపోయింది. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’కీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’కీ గ‌ట్టి పోటీ మొద‌లైంది.

`స‌రి లేరు..` టీజ‌ర్ రాక‌ముందు బ‌న్నీ సినిమాదే పై చేయి. ‘స‌రిలేరు..’ టీజ‌ర్‌తో ప‌రిస్థితి మారింది. ఒక్క టీజ‌ర్‌తో.. మ‌హేష్ సినిమా ముందుకు దూసుకెళ్లిపోయింది. టీజ‌ర్‌ని క‌ట్ చేసిన విధానం, అందులో చూపించిన కంటెంట్ అంద‌రికీ బాగా న‌చ్చింది. అది టీజ‌ర్‌లా లేదు. ట్రైల‌రే అనుకోవాలి. ఆ ఒత్తిడి `అల వైకుంఠ‌పుర‌ములో`పై పడింది.

ఈ టీజ‌ర్ ఎప్పుడో రావాల్సింది. కానీ.. టీజ‌ర్ కూడా అనేక వెర్ష‌న్లు క‌ట్ చేసీ చేసీ చివ‌రికి ఒక‌టి ఫిక్స్ చేశారు. ఇప్ప‌టికి కూడా టీజ‌ర్‌ని చెక్కుతూనే ఉన్నారు. ఫైన‌ల్ వెర్ష‌న్ ప‌నులు ఇంకా జ‌రుగుతూనేఉన్నాయి. కంటెంట్ చెప్ప‌డంతో పాటు, త్రివిక్ర‌మ్ మార్క్ ఛ‌మ‌క్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. మ‌రి వైకుంఠ‌పురం టీజ‌ర్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాల్సింద