జగన్ ప్రభుత్వం ఫై సంచలన వ్యాఖ్యలు

జగన్ ప్రభుత్వం ఫై సంచలన వ్యాఖ్యలు

అమరావతి రాజధాని ని విశాఖ పట్టణానికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, అయన అనుచరులు విశాఖపట్టణంలో భూ దందాలు నడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేసారు. అంతేకాకుండా ప్రజల నుండి బలవంతంగా భూములు లాకుంటున్నారని, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. విజయవాడలో టీడీపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన దేవినేని ఉమా జగన్ ప్రభుత్వం ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధానిని విశాఖపట్టణానికి తరలించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. అయితే ఈ ప్రక్రియ కోసం రహస్యంగా జీవో లు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసారు. అంతేకాకుండా ఉత్తర్వుల ఫై సంతకాలు చేసేముందు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఫోటో ను ముందు ఉంచుకోవాలని అన్నారు. అయితే జగన్ అక్రమాలకు సహకరించే అధికారులు మున్ముందు సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరికలు జారీ చేసారు. మరి ఈ విషయం ఫై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.