Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీపై ఎవరూ చేయని తీవ్రస్థాయిలో విమర్శ చేశారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. ట్రిపుల్ తలాక్ పేరుతో పాలిటిక్స్ చేస్తున్న మోడీ.. ముందు తన భార్య సంగతి తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో తెగ ఓవరాక్షన్ చేస్తున్న మోడీ.. తన భార్యను ఎందుకు దూరం పెట్టారో దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.
చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్లుగా మోడీ తీరు ఉందన్నారు షబ్బీర్. వ్యక్తిగతం ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తానన్న షబ్బీర్ అలీ.. ట్రిపుల్ తలాక్ ను మానిపించడానికి ఆచరణాత్మక విధానాలు కావాలన్నారు. ప్రభుత్వం ఊరికే ముస్లింలపై బురద జల్లడం కారణంగా ఆ దురాచారం పోదని, అసలు కేంద్రం చెబుతున్న స్థాయిలో ట్రిపుల్ తలాక్ బాధితుల్లేరని కుండబద్దలు కొట్టారు షబ్బీర్.
ఇక తెలంగాణలో కేసీఆర్ మాటల మాంత్రికుడిలా తయారయ్యారని, ఏమీ చేయకుండా ఏదో చేసేసినట్లు స్వర్గం చూపించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. జనాన్ని మాటలతో మాయచేసే కళలో కేసీఆర్ ఆరితేరారని, ఉద్యమం చేసి మరీ సాధించిన తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేస్తున్నారో.. ఆయనకూ తెలీదన్నారు షబ్బీర్.