ఢిల్లీ లో జీవీఎల్ మీద దాడి !

బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై బూటుతో దాడి జరిగింది. ఆయన మీద దుండగుడు ఒకరు బూటు విసిరాడు. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. కాంగ్రెస్ సానుభూతిపరుడే తనపై దాడి చేసి ఉంటాడని జీవీఎల్ ఆరోపించారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా గురువారం మధ్యాహ్నం జీవీఎల్ నరసింహా రావు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ తో కలిసి పోలింగ్ సరళి మీద ఆయన మాట్లాదుతున్న్ సమయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఓ వ్యక్తి తన కాలి బూటును తీసి జీవీఎల్ మీదికి బలంగా విసిరాడు. అది ఆయన ఛాతీ భాగంలో తగిలింది. అనుకోకుండా చోటు చేసుకున్న ఘటనతో అందరూ జీవీఎల్ సహా అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న జీవీఎల్ వ్యక్తిగత సిబ్బంది బూటు విసిరిన వ్యక్తిని వెనుక నుంచి బలంగా పట్టుకున్నారు. అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. అతణ్ణి శక్తి భార్గవగా పోలీసులు గుర్తించారు. నరసింహారావు తన ప్రెస్‌మీట్‌ను కొనసాగించారు