వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం …ఇద్దరు మృతి

వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం ...ఇద్దరు మృతి

వికారాబాద్‌లో కల్తీ కళ్ళు తాగి ప్రజలు వాంతులు విరోచనాలతో కళ్లు తిరిగి కింద పడిపోతున్నారు. చాల మంది ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. దీంతో వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు ఇద్దరు ప్రాణాల్ని బలితీసుకుంది. సేవించిన వారిలో కొంత మందికి కళ్లు తిరిగి వాంతులు, విరేచనాలతో ప్రజలు కింద పడిపోగా , మరి కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారుపలువురి పరిస్థితి విషమించడంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. మరోవైపు కల్తీ కల్లు అమ్మిన కల్లు కాంపౌండ్‌ను అధికారులు సీజ్ చేశారు.

ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్న వైద్యాధికారులు రెవెన్యూ సిబ్బంది.. ఘటనపై విచారణ చేపట్టారు. ఎందుకిలా ప్రజల అనారోగ్యం పాలవుతున్న దానిపై ఆరా తీశారు. కల్తీ కల్లు పలు గ్రామాలకు కూడా సరఫరా అయినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో జరిగిన కల్తీ కల్లు అమ్మకాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో వింత రోగం కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో వింత రోగం వ్యాపించింది. మొదటి రోజు జ్వరం ఆ తరువాత రెండు రోజుల్లో కడుపు ఉబ్బి చనిపోతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు.