మోదీని దూషిస్తే నాకు బాధ కలిగింది.. భావోద్వేగంగా మాట్లాడిన Pawan Kalyan
Pawan Kalyan Narendra Modi అంశంపై భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రసంగించిన Pawan Kalyan , మోదీపై వ్యక్తిగత దూషణలు తనను తీవ్రంగా కలచివేశాయని అన్నారు.
Pawan Kalyan మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో కొందరు విద్యార్థులు ప్రధాని మోదీని అవమానకరంగా దూషించిన ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

యువతకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే సంస్కారం, బాధ్యత గురించి నేర్పించాలని Pawan Kalyan సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.
“పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు వేస్తారు. మోదీపై విమర్శలు వినగానే నాకు కన్నీళ్లు వచ్చాయి. జంతర్ మంతర్లో ఆయనపై మాట్లాడిన మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని పవన్ కొనియాడారు. అలాంటి నాయకుడిని అవమానించడం అంటే దేశాన్ని అవమానించినట్టేనని, ప్రజలు కూడా ఆ భావనతో ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొందరు ఆయన అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశానికి అంకితం చేసిన అనంతరం జరిగిన సభలో Pawan Kalyan చేసిన ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.





