వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం’పై Aadarsha Kutumbam అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఆగస్ట్ నెల కూడా ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు మూడు టీజర్లతోనే ప్రమోషన్స్ను పరిమితం చేయడం ఫ్యాన్స్కు నిరాశ కలిగిస్తోంది. భారీ క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ కావడంతో మరింత జోరుగా ప్రమోషన్స్ నిర్వహించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో పలువురు దర్శకులు, హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ను ముందుగానే వేగం పెంచుతుండగా, ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో మాత్రం ఆ స్థాయిలో హడావుడి కనిపించడం లేదు.
ముఖ్యంగా ఈ సినిమాకు ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై మ్యూజిక్ పరంగానూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు సాంగ్ అప్డేట్ రాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్తో తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ కాంబినేషన్పై మొదటి నుంచీ ప్రత్యేకమైన హైప్ ఉంది. దీనికి తోడు శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇదిలా ఉంటే నిర్మాత నాగవంశీ ఇతర ప్రాజెక్టుల ప్రమోషన్స్లో బిజీగా ఉండటం కూడా ‘ఆదర్శ కుటుంబం’పై ప్రచార హడావుడి తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. అయితే అక్టోబర్ 2 విడుదల తేదీని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రమోషన్స్కు మరింత సమయం కేటాయించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అనుకున్న తేదీకి సినిమా సిద్ధం కాకపోతే విడుదల వాయిదా పడే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ అక్టోబర్ రిలీజ్ మిస్ అయితే 2027 సమ్మర్కు వెళ్లే పరిస్థితి వస్తే నిర్మాతలకు భారీ ఆర్థిక రిస్క్ ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాతి రోజుల్లో ‘జైలర్ 2’ వంటి భారీ చిత్రాలతో పోటీ కూడా ఎదురుకావచ్చు.
అందుకే ఎలాంటి వాయిదాలకు తావు లేకుండా అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్తో పాటు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి.



