రక్తమోడుతున్న తెలంగాణా….రహదారికి మరో ఐదుగురు బలి…!

road accedent in Gajwel

తెలంగాణాలో రహదారులు రక్తమోడుతున్నాయి, తాజాగా కొండగట్టు అంజన్నను దర్శించుకుని వస్తున్న ప్రయాణికులతో ఉన్న బస్సు లోయలో పది సుమారు అరవై మంది మరణించిన దృశ్యాలు కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి. ఆ ఘటన మరువకముందే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగిఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం పాములపర్తికి చెందిన కొన్ని కుటుంబాల వారు చేర్యాల సమీపంలోని ఓ గ్రామంలో బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి మధ్యాహ్నం టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు.

raod-accedent-gadwal

అయితే ఈ సమయంలో గజ్వేల్ జిల్లా రిమ్మనగూడకు చేరిన తర్వాత మరి కొంత మంది బంధువుల కోసం వేచి చూస్తూ రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి కూర్చున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన లారీ టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన వేగానికి టాటా ఏస్ నుండి కిందపడిన కొంత మందిని తొక్కుకుంటూ వెళ్లి కాస్త దూరంలో ఆగిపోయింది. దీంతో తెగిపడిన శరీర భాగాలు, రక్తస్రావంతో ఘటనా స్థలి భీకరంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు టాటా ఏస్ వాహనంలో మొత్తం 21 మంది ఉన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

raod-accedent-lorry-car