నటుడు సప్తగిరి రాజకీయాల్లోకి .. ఆ పార్టీలోనే చేరేది …

రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి
నటుడు సప్తగిరి

సినీ నటుడు కమెడియన్ సప్తగిరి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు. నేడు తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయన మీడియా తో మాట్లాడారు ..తొందరలోనే టీడీపీ లో చేరబోతున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. టీడీపీ అంటే తనకు చాలా అభిమానం అని .. తొందరలోనే ఆ పార్టీలో చేరుతానని అన్నారు.

ఇక అంతిమ నిర్ణయంమాత్రం టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దే అని వెళ్లడించారు. సప్తగిరి చిత్తూరు జిల్లా లోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించానని కూడా సెప్పుకోకరు. పేదలకు సేవ చేయడానికి ఏ అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తానని వివరించారు. ఇక పొతే వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడాని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కూడా చేస్తానని తెలిపారు.

అయితే తనకి సినిమాల కారణంగానే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని.. ఎట్టి పరిస్థితులలో సినిమాలను వదిలిపెట్టానని తెలిపారు సినీ నటుడు కమెడియన్ సప్తగిరి.

రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి
నటుడు సప్తగిరి