సెంచరి చేసిన సఫారి బ్యాట్స్‌మెన్‌

సెంచరి చేసిన సఫారి బ్యాట్స్‌మెన్‌

విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బానే రాణించేలా ఉంది. తొమ్మిదేళ్ల తర్వాత వైజాగ్ టెస్టులో సఫారీ ఓపెనర్ డీన్ఎల్గర్ సెంచరీ సాధించాడు. చివరిగా 2009 లో ఆఖరిగా హసీమ్ ఆమ్లా సెంచరీ సాధించాడు.

మూడోరోజు ఆసక్తిగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో 75ఓవర్లలో  ఓపెనర్ డీన్ఎల్గర్ సెంచరీ సాధించి  దక్షిణాఫ్రికా 248/5 స్కోర్ సాధించింది. 2015లో ఇండియాతో ఆడిననాలుగు టెస్ట్ సిరీస్ ఆటలో కనీసం ఒక్క దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ కూడా సెంచరీ సాధించలేదు. ఇపుడు తొలి రెండు రోజులు భారత్‌కి కనీస పోటీనివ్వలేకపోయిన ఈ రోజు పట్టుదలతో ఆడుతుంది.