దుమారం రేపుతోన్న అన‌సూయ ట్వీట్..

టాలీవుడ్ యాంకర్ కం యాక్ట్రస్ హాట్ బాంబ్ అన‌సూయ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌ అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోంది. సహజంగా ఆమె వేసే ప్రతిట్వీట్ బాంబుల్లా పేల‌తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ‘మ‌న‌వ‌ర‌కు వ‌స్తే కాని బుద్ధి రాద‌న్న మాట‌..’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో అన‌సూయ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ ట్వీట్ పై కొంద‌రు విజ‌య్ దేవ‌ర‌కొండ వ్య‌వ‌హారంపైనే ఇలాంటి కామెంట్ చేసింద‌ని చ‌ర్చించుకుంటున్నారు అనేకంటే చెవులు కొరుక్కుంటున్నారు అనడం సరిగ్గా సరిపోతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ‘మిడిల్ క్లాస్ ఫండ్’ పేరిట రూ.25 లక్షలతో నిధిని ఏర్పాటు చేశారు. అలానే మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించాడు. వీటిపై కొన్ని వెబ్‌సైట్స్ త‌ప్పుడు క‌థ‌నాలు అల్లి త‌న ప్ర‌తిష్ట‌ని దెబ్బ తీస్తున్నాయ‌ని తాజాగా విజయ్ దేవరకొండ ఫైర్ అయ్యాడు.

ఆయ‌న‌కి తోడుగా మ‌హేష్‌ ,ర‌వితేజ‌, అనీల్ రావిపూడి, అల్ల‌రి న‌రేష్ వంటి నటులు స‌పోర్ట్‌గా నిలిచారు. కాగా.. గ‌తంలో కొన్ని వెబ్‌సైట్స్ త‌ప్పుడు స్టోరీలను అల్లినప్పుడు ప‌లుమార్లు ఫైర్ అయిన అన‌సూయ‌కి మ‌ద్ద‌తు ల‌భించలేదు. ఈ నేప‌థ్యంలోంచే అనసూయ ఇలాంటి ట్వీట్ చేసి ఉండవచ్చనే గమ్మత్తైన ఆలోచనలో మునిగిపోయింది సినీలోకం. అంతేనంటేవా.