మణిరత్నం సినిమా ని నిరాకరించిన అనుష్క

మణిరత్నం సినిమా ని నిరాకరించిన అనుష్క

దక్షిణాది లో టాప్  హీరోయిన్లలో ఒకరైన అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లోనూ ఒక అతిథిపాత్రలో నటించింది.  ఈ సినిమాలు కాకుండా మణిరత్నం కొత్త ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ లో కూడా నటించేందుకు మొదటఒప్పుకుంది.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి అనుష్క తప్పుకుందట.  దీనికి కారణం ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు ఈ సినిమాలో భాగం కావడమేననే టాక్ వినిపిస్తోంది.  వైరముత్తుపై కొంతకాలం క్రితం సింగర్ చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.   మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నవారితో కలిసి పనిచేసేందుకు దేశ వ్యాప్తంగా కొందరు సెలబ్రిటీలు నిరాకరిస్తున్నారు.

అనుష్క ఈ విషయం బహిరంగంగా అయితే వెల్లడించలేదు కానీ అనుష్క తప్పుకున్న కారణం మాత్రం ఇదేనని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.ఏదేమైనా మణిరత్నం లాంటి డైరెక్టర్ సినిమా నుండి తప్పుకోవడం మాత్రం బోల్డ్ డెసిషన్ అనే చెప్పాలి.